శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్చేసుకోవాలని ఈవో తెలిపారు
సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ఆలయం చుట్టూ పూర్తిగా సవ్యమార్గంలో ప్రదక్షిణలు చేస్తాం. కానీ శివాలయాల్లో మాత్రం ప్రదర్శన క్రమం అలా చేయొద్దని శైవ ఆగమం చెబుతోంది. దీన్నే చండీశ్వర ప్రదక్షిణలు అని పిలుస్తారు. ఆలయానికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాకుండా, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ […]
ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణ మధ్యభాగంలో కన్నుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసుడి ముఖం కనిపిస్తుంది. దీనికే ‘మకర తోరణం’అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చడానికి గల కారణాలను స్కంద మహాపురాణంలో ఓ కథ ఉంది. పూర్వం ‘కీర్తిముఖుడు’ అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది.. తద్వారా వచ్చిన బలపరాక్రమంతో సమస్త భువనాల్లోని సకల సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుడి పత్ని అయిన ‘జగన్మాతను’ […]