సారథిన్యూస్, సిద్దిపేట/ఖమ్మం: హైదరాబాద్కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అందులో ఒకరు పరారీలో ఉన్నాడు. మరొకరు హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వారిద్దరూ హైదరాబాద్లోని ఓ మార్కెట్లో పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, […]
సారథిన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నది. తాజాగా హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యాజమాని విజయ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు దుకాణాన్ని మూసివేయించారు. షాప్లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. దీంతో ఇటీవల గోకుల్చాట్కు వెళ్లిన వారిలో ఆందోళన మొదలైంది. అధికారులు ఇటీవల షాపునకు వెళ్లినవారి వివరాలు సేకరిస్తున్నారు.
అమెరికాకు చెందిన ఓ పరిశోధనసంస్థ కరోనాకు వ్యాక్సిన్ను సిద్ధం చేస్తున్నది. రెమ్డెసివీర్ అనే వ్యాక్సిన్ కోవిడ్ కు కొంతవరకు అశాజనకంగా పనిచేస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. దీంతో దీన్ని ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ గిలీడ్ ఆసక్తి చూపుతున్నది. ఈ సంస్థ ఇండియాలోని సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్స్, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్, క్యాడిలా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి 127 దేశాలకు […]
సారథి న్యూస్ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్, సరూర్నగర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.
సారథిన్యూస్, నిజామాబాద్ రూరల్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధులను వణికిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి పాజిటివ్ రాగా తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాకు కరోనా వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. బాజిరెడ్డి గోవర్ధన్తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల […]
వరంగల్ రూరల్ జిల్లా: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. జర్నలిస్టులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మెరుగు సుధాకర్ కరోనా బారినపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ సుధాకర్ 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం సూర్యాపేట కరోనా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం
సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్లోని పెరుమాండ్ల భవన్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. […]