సారథి న్యూస్, కర్నూలు: ఏపీలో మంగళవారం కొత్తగా 1,155 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 16,238 శాంపిళ్లను పరీక్షించగా 1,178 కరోనా కేసులు తేలాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 21,197కు చేరింది. తాజాగా 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో 252 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. […]
సారథిన్యూస్, హుస్నాబాద్: అప్పడే పుట్టిన శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరమని డీఎంహెచ్వో మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో భాస్కర్, వైద్యాధికారులు మురళీకృష్ణ, సౌమ్య, శివయ్య, కనకయ్య, శ్రీనివాస్, వినీత్, రామ్మూర్తి, ప్రేమలత, సూపర్ వైజర్లు విజయ, ఎలగొండమ్మ, ఆశకార్యకర్తలు […]
సారథి న్యూస్, వరంగల్: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడు చిటూరి అశోక్ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు […]
సారథి న్యూస్, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]
జార్ఖండ్: లిక్కర్ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి […]
సారథి న్యూస్, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు మాట్లాడిన […]
సారథిన్యూస్, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్ బాషా హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్బాషాకు కరోనా పాజిటివ్ […]