సారథి న్యూస్, హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్రావు మార్గదర్శకం, కృషివల్ల తెలంగాణలో జలవిప్లవం వచ్చిందని, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతోందని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించి గైడ్ లైన్స్ రూపకల్పనకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీలివిప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతవిప్లవం (పాడి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544 నమోదైంది. తాజాగా కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 654కు చేరింది. 24 గంటల్లో 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదిలాఉండగా, కరోనా నుంచి కొత్తగా 1920 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధిబారి నుంచి […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.కరోనా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రంపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్రహోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ బాషాఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ […]
సారథి న్యూస్, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.
సారథి న్యూస్, రామాయంపేట: మత్స్యకారులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా రామాపంపేట మండలం డీ. ధర్మారంలోని ఊరచెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1.76కోట్ల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులు దళారులను నమ్మకుండా చేపలను సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు డంప్యార్డు, వైకుంఠధామాలను […]