Breaking News

వైకుంఠధామాలు

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More
రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]

Read More