Breaking News

భౌతికదూరం

జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం

సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్​ మంకిడి వెంకటేశ్వర్​రావు , హెచ్​ఎస్​ కోటిరెడ్డి, హెచ్​ఏ శ్రీనివాస్​, ఆశాకార్యకర్తలు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More