సారథి న్యూస్, నెట్వర్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, […]
సారథిన్యూస్, నిజామాబాద్ రూరల్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజానికంతోపాటు ప్రజాప్రతినిధులను వణికిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి పాజిటివ్ రాగా తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాకు కరోనా వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. బాజిరెడ్డి గోవర్ధన్తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా రోగులకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్డౌన్ను సడలించడంతో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టెస్టులసంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.