సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ‘సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాలను మార్చిన కథల గురించి మన్ కీ బాత్ కోసం షేర్ చేయండి’ అని మోడీ ట్వీట్ చేశారు. నమో యాప్ ద్వారా లేదా మై జీవోవీ […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని సౌత్ అనంత్నాగ్ జిల్లా బిజ్బెహరాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడు మృతిచెందారు. సెక్యూరిటీ ఫోర్స్పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సీఆర్పీఎఫ్ 90 బెటాలియన్ వద్ద రోడ్ ఓపెనింగ్ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను, ఐదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు కోసం గాలిస్తున్నామని అన్నారు. […]