సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో చేరేందుకు ఇంటర్మీడియట్ సెకండియర్ స్టూడెంట్స్కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్సీఎస్)/బీఏ(హెచ్ఈపీఏ), బీకామ్(కంప్యూటర్), జూన్ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(ఎన్డీజడ్సీ), […]