సామాజిక సారథి, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం మామూనూరు డివిజన్ ఏసీపీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో వాహనాలను, కిరాణా షాపులను తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీపీ నరేష్ కుమార్ గ్రామ ప్రజలకు నిషేధిత మత్తు పదార్థాల వినియోగం మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్డెన్ సెర్చ్ లో సరైన […]