Breaking News

మెదక్

గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

గోనెసంచులు లేక నిలిచిపోయిన తూకం

సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]

Read More
కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

రోడ్డుపైనే వరికుప్పలకు నిప్పు మొలకెత్తిన వడ్లతో నిరసన కాంటా పెట్టినా లారీలు వస్తలేవని ఆక్రందన సామాజిక సారథి, చిలప్ చెడ్: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెగింది. ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం చిట్కుల్​ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో 10 సెంటర్లు, ఐకేపీ ఆధ్వర్యంలో మరో మూడు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. […]

Read More
భూకబ్జాల చరిత్ర మీదే

భూకబ్జాల చరిత్ర మీదే

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]

Read More
నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండల ఖండ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. పర్యావరణ ప్రముఖ్ గా రవివర్మ, ఖండ వ్యవస్థ ప్రముఖ్ గా వీరప్ప, ఖండ కార్యవాహ్ గా జహిందర్ రెడ్డి, సహ కార్యవాహ్ గా సీతారామరావు, సంపర్క్ ప్రముఖ్ గా కృష్ణమూర్తి, బౌద్ధిక్ ప్రముఖ్ గా సర్వేశ్వర్, ఖండ ముఖ్యకార్యకర్తగా సతీష్ గౌడ్, సేవా ప్రముఖ్ గా విశ్వేశ్వర్ గౌడ్, ఖండ కార్యకర్తగా మల్గొండ మధును నియమించారు.

Read More
‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్​పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ […]

Read More
అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, మాడ్ శెట్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా వైకుంఠధామం పనులు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర పనులను పూర్తిచేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ […]

Read More
క్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి నుంచి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న12 లేగ దూడలను అల్లదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ కలిసి బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రామోజీపల్లి అటవీ ప్రాంతంలో 30లేగ దూడలను తరలించేందుకు పలువురు వ్యక్తులు కట్టివేసి ఉంచారని, అందులో 12 లేగ దూడలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలను తరలిస్తే కఠినచర్యలు […]

Read More
ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

నిర్వహణపై అధికారుల తీరు మారాలి గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​ సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ […]

Read More