సారథి న్యూస్, కర్నూలు: పొలం తగాదా విషయంలో ఇద్దరు సోదరులు, వారి వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలోని పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఓ వర్గం వారు పొలం దున్నడానికి వెళ్లగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై […]
అగర్తలా: బాలికలు, యువతులపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలో ఓ యువతి (17)పై ఐదుగురు యువకులు సామూహికంగా లైంగికదాడి పాల్పడ్డారు. ఖోవాయి జిల్లాలోని ఖాసియమంగల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకొని అడవుల్లోకి లాక్కెల్లారు. అనంతరం ఆమెపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో యువతి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయినా ఆ నరరూప రాక్షసుల కసి చల్లారలేదు. తమ స్నేహితులైన మరో ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించి […]
చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు సారథి న్యూస్, హైదరాబాద్ : ఆన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా […]
సారథి న్యూస్, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన […]
సారథి న్యూస్, కర్నూలు : నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తూన్న ఎస్బీఐ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
సారథిన్యూస్, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: బట్టతల వస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్ ఉప్పల్లోని సత్యానగర్లో మంగళవారం చోటుచేసుకున్నది. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ ఉప్పల్ ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తే జీవనం సాగిస్తున్నాడు. క్యాటరింగ్తో వచ్చిన డబ్బులను కొన్ని ఇంటికి పంపిస్తూ.. మరికొన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం దాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడి సోదరి పెళ్లి కోసం డబ్బు కావాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు కరోనాతో క్యాటరింగ్ పనులు నిలిచిపోయాయి. […]
సారథి న్యూస్ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్లోని రుద్రాపుర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]