Breaking News

Month: July 2020

ఇద్దరు టెర్రరిస్టుల హతం

ఇద్దరు టెర్రరిస్టుల హతం

బారాముల్లా: జమ్మూకాశ్మీర్‌‌ బారాముల్లా జిల్లాలోని నౌగామ్‌లో సెక్యూరిటీ ఫోర్స్‌, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లైన్‌ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించిన సెక్యూరిటీ ఫోర్స్‌ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మరికొంత మంది తప్పించుకున్నారనే అనుమానంతో ఏరియా మొత్తం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. వారి నుంచి ఏకే 47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది […]

Read More
ఉత్తేజిత కథలను షేర్‌‌ చేయండి

ఉత్తేజిత కథలను షేర్‌‌ చేయండి

న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం జరిగే మన్‌ కీ బాత్‌ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్‌‌ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ‘సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాలను మార్చిన కథల గురించి మన్‌ కీ బాత్‌ కోసం షేర్‌‌ చేయండి’ అని మోడీ ట్వీట్‌ చేశారు. నమో యాప్‌ ద్వారా లేదా మై జీవోవీ […]

Read More
నా ప్రభుత్వం కూల్చాలని చూస్తున్నారు

నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు

జైపూర్‌‌: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్‌ గేమ్స్‌ ఆడుతోందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్‌‌ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషీ ఎస్‌వోజీ, ఏసీబీ ఆఫ్‌ రాజస్థాన్‌ పోలీస్‌కు కంప్లయింట్​ చేశారు. ‘దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు […]

Read More
ఆశీర్వచనం ఎందుకు ఇస్తారు?

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]

Read More

ఏపీలో కులాల కుమ్ములాట

ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగ‌బ‌ద్ధమైన ప‌ద‌వుల‌ను ప్రభుత్వాలు గౌర‌వించాలి. వ్యక్తిగ‌త ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుప‌ర‌చిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ […]

Read More

కరోనాకు మరో మందు

ఢిల్లీ: కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా మరో ఔషధానికి అనుమతిచ్చింది. చర్మవ్యాధి అయిన సొరియాసిస్​ను నయం చేసేందుకు ఉపయోగించి ‘ఇటోలీజుమ్యాజ్​’మందును కరోనాకు వాడొచ్చని చెప్పింది. ఈ మెడిసిన్​ కేవలం ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఓ మోతాదు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడొచ్చని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్​కు చెందిన బయోకాన్​ సంస్థ దీన్న తయారుచేస్తోంది. కోవిడ్​పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది […]

Read More

కరోనా కేసులు @ 8 లక్షలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్​ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు […]

Read More

ఐసోలేషన్​లో కర్ణాటక సీఎం

బెంగళూరు: కర్ణాటక సీఎం యడ్యూరప్ప హోంఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన కార్యాలయంలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్​ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా కార్యాలయంలోని కొంతమందికి కరోనా పాజిటివ్​ రావడంతో నేను హోం ఐసోలేషన్​లోకి వెళుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తాను అధికారిక నివాసం ‘కావేరి’ నుంచి పనిచేస్తానని… వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అధికారులకు తగిన సూచనలు […]

Read More