సారథి న్యూస్, నర్సంపేట: దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పాడి గేదేల పంపిణీ కింద రూ.17.70కోట్లను విడుదల చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో ఆరంభించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ జరుగనునన్నట్లు తెలిపారు లబ్ధిదారులపై ఎలాంటి భారం […]
సారథి న్యూస్, హైదరాబాద్ : రాజస్థాన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకప్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని […]
సారథిన్యూస్, గోదావరిఖని: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]
ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా […]
తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్స్టార్ మహేశ్బాబు […]
రెండు సంవత్సరాల తర్వాత పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో […]
సారథి న్యూస్, సిద్దిపేట: మంత్రి టి.హరీశ్రావు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ వీధిలో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగీ, చికున్గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమవుతున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని అవగాహన కల్పించారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట సమీపంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఆరునెలలుగా తాము చేస్తున్న పోరాటాలు, ఒత్తిడి వల్ల పనులు వేగవంతంగా పూర్తయ్యాయని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే తన స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి […]