న్యూఢిల్లీ: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులు, ఇతర సిబ్బందికి విషెష్ చెప్పారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో డాక్టర్లదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వారి జీవితాల్ని పణంగాపెట్టి మనల్ని కాపాడుతున్నారని చెప్పారు. ‘తల్లి బిడ్డకు జన్మనిస్తే..అదే బిడ్డకు వైద్యులు పునర్జన్మని ఇస్తారు” అని అన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్డే పురస్కరించుకుని దేశంలోని సీఏలందరికి మోడీ విషెస్ చెప్పారు. దేశ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తు సీఏల చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతను […]
స్టార్ హీరోయిన్స్ చాలామంది స్పెషల్ సాంగ్స్ చేయాలంటే సై అంటున్నారు. అదే వరుసలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్ రాజ్పుత్కూడా స్పెషల్ సాంగ్కు రెడీ అంటోంది. తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే వెంకీమామలో వెంకటేష్ పక్కన సంప్రదాయ పద్ధతి పాత్ర పోషించి మెప్పు పొందింది. తర్వాత తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్ర, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సీత’ […]
కరోనా వల్ల పారిశ్రామిక రంగాలే కాదు సినిమా ఇండస్ట్రీ పురోగతి కూడా డైలమాలో పడింది. థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్కు రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సమయంలో సినీనిర్మాతలను ఆదుకునేందుకు ఒయాసిస్లా కనిపించింది ఓటీటీ ఫ్లాట్పామ్. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకైతే ఓకే కానీ భారీ వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలకు ఇది వర్కవుట్అవుతుందని కొందరు నిర్మాతలు, హీరోలు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు […]
న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామీజీ గోల్డెన్ బాబా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సపొందుతున్నారు. హరిద్వార్కు చెందిన గోల్డెన్ బాబాపై కిడ్నాప్, దోపిడీ, హత్యాబెదిరింపు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో ఉంటున్నారు. బాబా స్వస్థలం ఘజియాబాద్. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయన ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేసేవాడు. అనంతరం సన్యాసం స్వీకరించి ఢిల్లీలో 1972లో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. భారీగా బంగారం ధరించడంతో అతడికి గోల్దెన్బాబా అనే […]
న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్లోని ధమిఖేడకు చెందిన శ్రావణ్ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]
ముంబై: మహారాష్ట్రలోని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మాతృభాష అమలుపై కఠినంగా వ్యవహరిస్తున్నది. బాల్ థాక్రే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నది. అన్ని రకాల కార్యకలాపాలు, అధికారిక ఉత్తర్వులు మరాఠీలోని కొనసాగించాలని అదేశించింది. ఈ ఆదేశాలను అతిక్రమించే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వారి వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్లో ‘మరాఠిని వాడటంలో విఫలమైన వారి సర్వీస్ బుక్లో నెగెటివ్ మార్క్స్ వేస్తాం. వార్షిక ఇంక్రిమెంట్ను నిలిపేస్తాం’ అని వెల్లడించింది.
హీరో నితిన్ పెళ్లి డేట్ ఖరారయినట్టు సమాచారం. ఏప్రిల్ 16న నితిని పెళ్లి జరుగాల్సి ఉండగా లాక్డౌన్తో వాయిదా పడింది. నాగర్కర్నూల్కు చెందిన వైద్యురాలు నూర్జహాన్ కుమార్తె కందూకూరి శాలినితో నితిన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిందే. శాలినీ లండన్లో విద్యనభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు జూలై 26న నిర్వహించడానికి […]
విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ కొత్తపంథాను ఎంచుకోన్నారు. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడగా.. నటీనటిలందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈక్రమంలో ప్రకాశ్రాజ్ కూడా ఓ వెబ్సీరిస్లో నటించనున్నట్టు తెలిసింది. దీని చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఓ యాధార్థ ఘటన ఆధారంగా ఈ వెబ్సీరిస్ను రూపొందిస్తున్నారట. దీనిలో ప్రకాశ్రాజ్ నటించడమే కాక కథా సహకారం కూడా అందిస్తున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.