సారథి న్యూస్, కర్నూలు: నగరంలో ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టవద్దని రెండవ రోజు బుధవారం పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలు జొహరాపురం, చిత్తారి వీధి, కొత్తపేట, రోజా వీధి ఏరియాల్లో 25 ఏళ్లుగా ఇసుక బండ్ల ద్వారా దళిత బడుగు బలహీనవర్గాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఉపాధికి గండి […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఇంటి పట్టాల పంపిణీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ రవి పట్టాన్ షెట్టి, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.
కోలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలోనే ‘పటాస్’ తో హిట్ అందుకున్నాడు ధనుష్. తెలుగులో ఆ సినిమా ‘లోకల్ బాయ్’గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ధనుష్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ‘జగమే తంత్రమ్’ చిత్రం చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రిలీజైన ఈ మూవీ మోషన్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ మూవీలో ధనుష్ గ్యాంగ్స్టార్గా డిఫరెంట్స్ గెటప్స్ లో కనిపించనున్నాడని అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ […]
జీవిత, రాజశేఖర్ ఇద్దరు డాటర్స్ వెండితెరపై మెరవడానికి రెడీ అయ్యారు. రెండో కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచిపేరు సంపాదించింది. ఇక మొదటి కూతురు శివానీ ఎంట్రీ మాత్రం కాస్త లేటైంది. అసలు రెండేళ్ల క్రితమే అడవి శేష్ తో ‘టూ స్టేట్స్’ తెలుగు రీమేక్తో శివానీ ఎంట్రీ ఉంటుందనుకున్నారు. అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సుమంత్తో ‘విక్కీడోనర్’ రీమేక్ ‘నరుడా డోనరుడా’ తీసిన మల్లిక్ […]
న్యూఢిల్లీ: లద్దాఖ్ లేక్ వద్ద చైనాకు సమాధానం చెప్పేందుకు భారత్ దేశం హై పవర్ బోట్స్ను మోహరిస్తోంది. పెట్రోలింగ్కు చైనా వాడుతున్న చైనీస్ వెజల్స్కు చెక్ పేట్టేందుకు వీటిని దించుతున్నట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లోని పాంగోంగ్ సరస్సు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణకు కేంద్రంగా ఉంది. భూభాగాన్ని విడిచిపెట్టాలని భారతీయులని బెదిరిస్తోంది. స్టీల్ హల్డ్ బోట్లును బోర్డర్లో మోహరించాలని గతవారం ట్రై సర్వీసెస్ మీటింగ్లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీ–17 హెవీ బోట్లను లిఫ్ట్ ట్రాన్స్పోర్టర్స్ […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జావాన్, ఓ పౌరుడు చనిపోయారు. పెట్రోల్ పార్టీ టీమ్పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తుండగా.. ఒక జవాను అమరుడైనట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఫ్యామిలీతో అటుగా వెళ్తున్న వ్యక్తికి బుల్లెట్లు తగలడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడన్నారు. కారులో వచ్చిన టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని, వారి […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్లో ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ చివరి నాటికి 60వేల కేసులు వస్తాని అంచనా వేశామని, కానీ 26వేల కేసులే వచ్చాయని ఆయన చెప్పారు. రోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా వారం రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. నాలుగు వేల కౌంట్ నుంచి 2500కు తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో 2,199 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య […]
న్యూఢిల్లీ: చాలా తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్టాక్ యాప్ను ఇండియా బ్యాన్ చేయడంపై ఆ సంస్థ సీఈవో కెవిన్ మెయర్ మన దేశంలోని ఎంప్లాయీస్కు లెటర్ రాశారు. ఈ అంశంపై స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ‘వాటాదారులతో కలిసి సమస్యలను పరిష్కరించేందుకు చూస్తున్నాం. టిక్టాక్ భారతీయ చట్టం ప్రకారం డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది. 2018లో స్టార్ట్ అయిన ఈ టిక్టాక్ యాప్ […]