సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయకుడు దినకర్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్ ఆదివారం జూబ్లీహిల్స్ లో తన కుమారుడు ఎబినేజర్ పాల్ తో కలిసి మొక్కలు నాటారు. అందరం ఆరోగ్యంగా ఉండాలంటేనే మొక్కలను నాటాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు […]
వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రంగా చెబుతుంటారు. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెబుతారు. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకు శాంతులు చేయాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించారు. దానికనుగుణంగా మనం నక్షత్రశాంతులు, గ్రహశాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా […]
దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్శాఖ అప్రమత్తమైంది. లాక్డౌన్తో సినిమా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్డౌన్తో ఈ చిత్ర షూటింగ్ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్ ఇంటికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి […]
తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్ అంటూ హారర్ […]
కీర్తిసురేశ్ తాజాగా నటిస్తున్న ‘మిస్ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలియజేశాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరికొన్ని సాంగ్స్ సిద్ధమవుతున్నాయని తమన్ తెలిపారు.
సారథి న్యూస్, మునగాల: క్రషర్ మిల్లులో రాత్రి వేళ నిర్వహిస్తున్న బ్లాసింగ్లు ఆపాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న క్రషర్ మిల్లులో యాజమాన్యం తరచూ రాత్రి వేళ పెద్ద ఎత్తన బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. దీంతో స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం క్రషర్ మిల్లు యాజమాన్యం బ్లాసింగ్లు ఆపాలంటూ వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెరుగుతున్న డీజిల్ ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం భారీగా పెరిగి పోయింది. సాగు పనులకు కూలీల కొరత వేధిస్తుండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చే వరకు కీలకంగా మారాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా […]