చండీఘర్: పంజాబ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్సర్, బాటాలా, టరన్టరన్ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్సింగ్ ట్వీట్ చేశారు.
నిఖిల్ ఇండస్ర్టీకొచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ డిఫరెంట్ మూవీస్తో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు 20వ సినిమాకు చేరువలో ఉన్నాడు. ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సోనాలి నారంగ్ ప్రెజెంట్స్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ గ్రూప్స్ అధినేతలు నారాయణ్ దాస్, పుష్కర్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా […]
మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ అరెంజ్మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన కోరారు. ఆగస్టు 7లోగా డీఈవోలకు అప్లికేషన్స్ పంపించాలని సూచించారు. హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్లకు రెండు అవార్డుల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత డీఈవో ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.
మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తప్పనిసరి అధికారులతో సమీక్షించిన సీఎస్ సోమేశ్కుమార్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నిపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెలా తప్పనిసరిగా కరెంట్ బిల్లులు చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయి బిల్లులపై వారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. […]
బికినీ డ్రెస్లో బాలీవుడ్లో టాప్ హీరోయిన్లు కనిపించినంతగా టాలీవుడ్ భామలు కనిపించరనే చెప్పుకోవచ్చు. లేటెస్ట్ హీరోయిన్స్ అనుష్క, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. అయితే లేటెస్ట్ ఆపిల్ బ్యూటీ హన్సిక కూడా నేనూ బికినీ వేసేస్తానంటోంది. అనడమే కాదు సోషల్ మీడియాలో బికినీ వేసిన డ్రెస్లతో ఫోజులు కూడా ఇచ్చేసింది. పైగా దానికో వివరణ కూడా ఇస్తోంది. తాను నటించనున్న 50వ చిత్రం ‘మహా’ […]
గుజరాత్ : గుజరాత్లోని సూరత్కు చెందిన ఖాదర్ షేక్ కరోనా వైరస్ సోకి ప్రయివేట్ హాస్పిటల్లో చేరాడు. 20 రోజుల పాటు ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత వారు వేసిన బిల్లు చూసి బిత్తర పోయాడు. ఇలా అయితే పేద ప్రజలు ఎలా వైద్యం చేయించుకుంటారా అనే ప్రశ్న అతన్ని తొలచింది. దీంతో తన ఆఫీసునే హాస్పిటల్గా మార్చేశాడు. 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నాడు. వైద్య సిబ్బంది, యంత్రాలు, […]
చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు సారథి న్యూస్, హైదరాబాద్ : ఆన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా […]