సారథిన్యూస్, కొత్తగూడెం: బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్, కేక్ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్రెడ్డి, నాయకులు, […]
సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్లో ఏఎల్విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. […]
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్వరుణ్ తేజ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ భామ దిశా పటాని. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. తర్వాత దిశకు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో నేటివ్ అయిన బాలీవుడ్కు వెళ్లింది. అక్కడ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ చిత్రంలో సుషాంత్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి అక్కడ. దాంతో టాలీవుడ్ వైపు […]
వాషింగ్టన్: మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటుచేసేలా కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేస్తున్నారని వైట్హౌస్ చెప్పింది. టెలిముండో న్యూస్ చానెల్కు ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్మిగ్రేషన్పై మాట్లాడిన తర్వాత వైట్హౌస్ ఈ ప్రకటన వెలువరించింది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్(డీఏసీఏ) ప్రోగ్రామ్ కింద పౌరసత్వానికి మార్గం ఏర్పడుతుందని ట్రంప్ చెప్పారు. ‘అది చాలా పెద్ద, మంచి బిల్లు కానుంది. మెరిట్ ఆధారిత బిల్లు, దాంట్లో డీఏసీఏ కూడా […]
సారథిన్యూస్, రామడుగు: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్స్నాచింగ్ పాల్పడుడుతున్న ఇద్దరు దొంగలను రామడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వేముల రమేశ్(23), వేముల నర్సింహులు(19) జల్సాలకు అలవాటుపడి చైన్స్నాచింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎస్సై అనూష రామడుగు చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా వీరిద్దరు అనుమానస్పదంగా […]
బారాముల్లా: జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని నౌగామ్లో సెక్యూరిటీ ఫోర్స్, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లైన్ఆఫ్ కంట్రోల్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించిన సెక్యూరిటీ ఫోర్స్ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మరికొంత మంది తప్పించుకున్నారనే అనుమానంతో ఏరియా మొత్తం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. వారి నుంచి ఏకే 47 గన్తో పాటు కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది […]
న్యూఢిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ‘సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాలను మార్చిన కథల గురించి మన్ కీ బాత్ కోసం షేర్ చేయండి’ అని మోడీ ట్వీట్ చేశారు. నమో యాప్ ద్వారా లేదా మై జీవోవీ […]
జైపూర్: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్ గేమ్స్ ఆడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ విప్ మహేశ్ జోషీ ఎస్వోజీ, ఏసీబీ ఆఫ్ రాజస్థాన్ పోలీస్కు కంప్లయింట్ చేశారు. ‘దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు […]