చెన్నై: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మోసగాళ్ల రెచ్చిపోతున్నారు. కరోనాకు మందు కనిపెట్టామంటూ ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ప్రకటించి.. ఆ తరువాత తూచ్ అంటూ నాలుక కరుచుకున్నది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ స్వీట్ షాప్ ఇదే తరహా మోసానికి పాల్పడింది. తమ దుకాణంలో తయారుచేసే మైసూర్ పిక్ తిని కరోనాను నయం చేసుకోవచ్చని ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాక రూ.800 కిలో చొప్పున ఆ స్వీట్ను అమాయకులకు అంటగట్టింది. ఈ మైసూర్పాక్లో 19 రకాల […]
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్లోని బందిపోర్లో బీజేపీ నేత వసీమ్ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్, అతడి తండ్రి బషీర్, సోదరుడు ఉమర్ బషీర్పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్స్టేషన్కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]
కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ క్రిమినల్ పోలీసులకు చిక్కాడు. వికాస్దూబే కోసం మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వికాస్దూబే ఉజ్జయినీలోని ఆలయం సమీపంలో కనిపించాడు. గమనించిన ఓ దుకాణ యజమాని పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం వికాస్దూబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎనిమిది […]
కన్నడ యువనటుడు సుశీల్గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను […]
సారథి న్యూస్, అలంపూర్: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక […]
సారథి న్యూస్, అలంపూర్: ఈనెల 13 నుంచి 19 వరకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను మూసివేస్తున్నట్లు అలంపూర్ ఆలయాల ఈవో ప్రేమ్కుమార్ పేర్కొన్నారు. అలంపూర్లో దర్గా ఉర్సు సందర్భంగా వారం రోజుల పాటు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటే కొవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి మూసివేస్తారని, ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదన్నారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు నిరసనకు దిగాడు. ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తంచేశాడు. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి సదరు నిరసనకారుడు ఎవరనే వివరాలను ఆరాతీస్తున్నారు. కాగా, పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్ట్యాగ్ ను […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో […]