Breaking News

Day: June 2, 2020

క్రికెటర్ల శిక్షణకు ఎన్సీఏ కసరత్తు

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్​ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్​ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్​కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్​ను మొదలుపెట్టడం. ఇందుకు […]

Read More

సచిన్ ఆట కోసం క్లాసు​లకు డుమ్మా

న్యూఢిల్లీ: బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట కోసం క్లాస్​లకు డుమ్మా కొట్టే వాళ్లమని సురేశ్ రైనా అన్నాడు. భారత మ్యాచ్​ల కోసం వారంరోజుల నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్లమన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు కుటుంబసభ్యులతో తిట్లు తిన్నామని చెప్పాడు. ఈ సందర్భంగా 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను చూసేందుకు తాము పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆ రోజు ఆసీస్​తో మ్యాచ్​తో గెలిస్తే ఫైనల్​కు చేరుతాం. ఆ మ్యాచ్​ను ఎలాగైనా చూడాలని నేను, […]

Read More

ఈ తరం వాళ్లదే..

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్​ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]

Read More

ఖేల్‌రత్నకు అమిత్‌, వికాస్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డుల కోసం ఇద్దరు బాక్సర్లను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ ​షిప్​ రజత విజేత అమిత్ పంగల్(52 కేజీ), వికాస్ క్రిషన్ (69 కేజీ)ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. గతంలో అమిత్ పేరును మూడుసార్లు అర్జున అవార్డుకు సిఫారసు చేసినా సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 2012లో డోపింగ్ కేసులో అమిత్ దోషిగా తేలడంతో అతన్ని పక్కనబెడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కమిటీ […]

Read More

ఐపీఎల్‌ లో కచ్చితంగా ఆడతా: స్మిత్‌

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్​లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్​కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్​లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్​కు కెప్టెన్​గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్​లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ […]

Read More
నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

న్యూఢిల్లీ: అనుకోకుండా వచ్చిన కరోనా బ్రేక్ వల్ల తన కెరీర్​ను మరో రెండేళ్లు పొడిగించుకునే అవకాశం వచ్చిందని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. పక్కటెముక గాయంతో జనవరిలో ఆటకు దూరమైన అండర్సన్.. ఈ విరామంలో పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గతవారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ‘మళ్లీ క్రికెట్ మొదలుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రేక్షకులు లేకుండా కేవలం నెట్స్​లోనే ప్రాక్టీస్ చేస్తున్నందుకు కొంత అసంతృప్తిగా ఉంది. ఈ రెండింటిలో కామన్​గా ఉన్నది క్రికెట్ […]

Read More

అమరుల త్యాగాలతోనే తెలంగాణ

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్​ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు. నాటి తెలంగాణ ఉద్యమ […]

Read More