టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ న్యూఢిల్లీ: ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమే.. ఐపీఎల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్యాట్స్మెన్ స్థాయి నుంచి సారథిగా ఈ ముంబైకర్ ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘2008 రోహిత్ డెక్కన్ చార్జర్స్కు ఆడాడు. అప్పుడు అతనో కుర్రాడు. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ మాత్రమే ఆడాడు. అరంగేట్రం ఐపీఎల్ లో డీసీ […]
సారథి న్యూస్, మెదక్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. చావులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రుచిత అమ్మానాన్నలు రూ.ఆరులక్షల విలువైన బంగారు […]
గ్రీన్ జోన్లోనూ ఇద్దరి పాజిటివ్ మెదక్లో చాపకింద నీరు మహమ్మారి సారథి న్యూస్, మెదక్: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని […]
‘సయ్యారే సయ్యారే సయ్యా హోరే.. ఓరుగల్లు గల్లుకే పిల్ల గుండె ఝల్లుమన్నాదే..’ మరచిపోయే పాట ఇది. ‘సైనికుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా కెరీర్ మాత్రం ‘ప్రేమికులు’ సినిమాలో హీరోయిన్గానే స్టార్ట్ చేసింది. మంచి ఫామ్లో ఉండగానే కర్ణాటకకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ను పెళ్లాడి ఇద్దరి పిల్లల తల్లయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించాలనిపిస్తోందట. అందుకే ఓ లేడీ ఓరియండెట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది కామ్నజెఠ్మలానీ. అదికూడా తాను ఒకప్పుడు హీరోయిన్ గా పరిచయమైన తెలుగులోనే. […]
హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన హెల్త్ కండీషన్ ఉన్నట్టుండి క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబసభ్యులు ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతి ఇచ్చారు. వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల […]
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఎటాక్ చేసేందుకు పుల్వామాలో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన కారు హిజ్బుల్ టెర్రరిస్ట్ హిదయతుల్లా మాలిక్కు చెందిందని పోలీసులు గుర్తించారు. అతను జమ్మూకశ్మీర్లోని షోపియాన్కు చెందిన వ్యక్తి. 2019 జులై నుంచి హిజ్బుల్ టెర్రర్ గ్రూప్లో యాక్టివ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హిదయతుల్లా తమ్ముడు సమీర్ను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. సమీర్ అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019 […]