Breaking News

విశాఖలో టీడీపీకి మరో షాక్​!

సారథిన్యూస్​, విశాఖపట్నం: ‘మేము మూడు రాజధానులకు ఒప్పుకోం.. అమరావతే ఆంధ్రుల రాజధాని’ అని మంకుపట్టు పట్టిన టీడీపీకి ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్​ కాంగ్రెస్​లో చేరారు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్​బై చెప్పనున్నారని సమాచారం. గణేశ్​తో పాటు మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకు వీడ్కోలు చెప్పనున్నారట. గణేశ్​.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఆయన​ సీఎం జగన్మోహన్​రెడ్డితో భేటీ కానున్నారని టాక్​. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి చంద్రబాబుపార్టీని వీడారు. వారంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం గణేశ్​ కూడా వారి బాటలోనే పయనించనున్నారట. వరుసగా నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు తీవ్ర నైరాశ్యం చెందుతున్నారట. చంద్రబాబు వృద్ధుడైపోవడం.. లోకేశ్​ రాజకీయాల్లో రాణిస్తాడన్న నమ్మకం లేకపోవడంతో నేతలంతా టీడీపీకి గుడ్​బై చెబుతున్నారని సమాచారం.