Breaking News

చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ బాబు!

సారథిన్యూస్​, అమరావతి: స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడు.. రమేశ్​ ఆస్పత్రి యాజమాని డాక్టర్​ రమేశ్​ బాబు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో దాక్కొని ఉంటారని వైఎస్సార్​సీపీ విజయ్​సాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్​ చేశారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. మరోవైపు స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో డాక్టర్ రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. ఎనిమిదవ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి వాదనలు విననున్నారు.