విజయనగరం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాంబశివరాజు వైఎస్సార్సీపీలో చేరారు.
రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు
సాంబశివరాజు ఏపీ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా, 8సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989-94లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్గా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ అసెంబ్లీ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహించారు. కాగా, 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన మంత్రిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు సంతాపం ప్రకటించారు.