Breaking News

తెలంగాణలో 2,239 కరోనా కేసులు

తెలంగాణలో 2,239 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: కరోనా ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో శనివారం కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారిన పడి 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరింది. ఇప్పటివరకు 1,52,441 మంది వ్యాధి వారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్​కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24,683 మంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒకేరోజు 58,925 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 28,00,761 వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులెటిన్​ను విడుదల చేసింది.