Breaking News

తెలంగాణలో 1,021 కరోనా కేసులు

తెలంగాణలో 1,021 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 30,210 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారినుంచి తాజాగా 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 20,036 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 35,77,261కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.