Breaking News

కరోనాతో ఏడుగురు మృతి

కరోనాతో ఏడుగురు మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్​కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్​105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, కామారెడ్డి 43, వరంగల్​అర్బన్​34, వరంగల్​రూరల్​20, కరీంనగర్​27, జగిత్యాల 18, మహబూబాబాద్​27, మెదక్​26, జయశంకర్​భూపాలపల్లి 27, నల్లగొండ 45, నాగర్​కర్నూల్​18, నిజామాబాద్​48, సిద్దిపేట 14, సూర్యాపేట 27 చొప్పున కేసులు నమోదయ్యాయి.