సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ మంగళవారం వెల్దండ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]
సామాజికసారథి, వెల్దండ: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు టీఆర్ఎస్ వెల్దండ మండలాధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణతో మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులుకు రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే సీసీ కెమెరాలతో గుర్తించవచ్చని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం విరాళం అందజేసిన వారిని […]
ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో […]