సారథిన్యూస్, రామడుగు: జీహెచ్ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]
సారథి న్యూస్, రామడుగు: కరోనాతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేనందున తమను ఆదుకోవాలని హెచ్బీటీ ( అవర్లీ బేస్డ్ టీచర్స్) కోరారు. మంగళవారం వారు చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్బీటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యానందం, రమేశ్, రమణ, జ్యోతి , అరుణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.