Breaking News

ములుగు

ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు

సారథి, ములుగు: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం క్రిష్ణయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల హయాంలో 1946 మే 17న మగ్దూం మొహియుద్దీన్ ఇంట్లో కొందరు ఉపాధ్యాయుల సమావేశమై పురుడుపోసుకున్న సంఘం 1947 జూన్ 9న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా ఆవిర్భవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఎస్టీయూగా రూపాంతరం చెంది నాటి నుంచి […]

Read More
అన్ని మెడికల్ టెస్టులు ఒకేచోట

అన్ని మెడికల్ టెస్టులు ఒకేచోట

ములుగు హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్యతో కలిసి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సెంటర్ లో 57 రకాల వైద్యపరీక్షలు చేయించుకోవచ్చన్నారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో పరికరాలను సమకూర్చి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాను పూర్తిగా […]

Read More
కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ […]

Read More
ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి […]

Read More
లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన తోట భాస్కర్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత కలసి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]

Read More