జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని, రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. […]
అసంపూర్తిగా స్మశాన వాటిక నిర్మాణాలు సామాజిక సారథి, కౌడిపల్లి: స్మశాన వాటిక పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినా, కొంతమంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో అధికారులు, సంబంధిత నాయకులు విఫలమవుతున్నారు. అన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో స్మశానవాటికల నిర్మాణాలు మందకోడిగా కొనసాగుతున్నాయి. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (ఆర్), తిమ్మాపూర్ గ్రామంలో స్మశానవాటికలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి […]