సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్ లింగంగౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్ నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామ ప్రజల దాహం తీరింది. ఈ గ్రామంలో తాగునీరు లేక చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలోని బారడీ పొచమ్మ గుడివద్ద సర్పంచ్ బోర్ వేయించారు. ఈ బోర్లో రెండు ఇంచులు నీరు పడటంతో గ్రామస్థుల దాహం తీరినట్టైంది. బుధవారం ఓ బోర్కు మోటర్ బిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సవిత బసప్ప, ఉప సర్పంచ్ బీ రాజు, వార్డు మెంబర్లు, […]