Breaking News

TOLLYWOOD

నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా..

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్​ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్​తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]

Read More

‘జాంబీరెడ్డి’పై ఓ సామాజికవర్గం ఫైర్​

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్​వర్మ తన మూడో సినిమాకు ‘జాంబీరెడ్డి’అనే టైటిల్​ను ఖరారుచేసి ఇటీవల చిత్ర పోస్టర్​ను విడుదల చేశాడు. దీనిపై రెడ్డి సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్​ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రెడ్డిసంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు రెడ్లకు సంబంధించిన సామాజికవర్గాల్లో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘జాంబీరెడ్డి’ […]

Read More

హిందీ రీమేక్​లో ఈషా

ఈషా రెబ్బా ఓ హిందీ రీమేక్​ వెబ్​సిరీస్​లో నటించనున్నట్టు సమాచారం. హిందీలో విజయం సాధించిన ‘లస్ట్​స్టోరీస్​’ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. ఈచిత్రంలో ఓ బోల్డ్​ పాత్రలో ఈషా నటించనున్నట్టు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్‌ వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హీరోయిన్స్​ కూడా అటువంటి పాత్రల్లో నటించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. హిందీలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‌లో ఈషా […]

Read More
మరో హీరోయిన్​కు కరోనా

తమిళ హీరోయిన్​కు కరోనా

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్​ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్​ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్ర‌స్తుతం లారెన్స్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం త‌మిళ్ రీమేక్‌లో […]

Read More

నిరాడంబరంగా నిహారిక ఎంగేజ్​మెంట్​

మెగాబ్రదర్​ నాగబాబు కూతురు​, నటి నిహారిక.. ఎంగేజ్​మెంట్​ గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్​లోని ట్రైడెంట్​ హోటల్​లో నిరాడంబరంగా జరిగింది. గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కాగా, కేవలం కొంతమంది అతిథులు మధ్య ఎంగేజ్​మెంట్​ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగులోకి […]

Read More

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం […]

Read More
ట్విట్లర్లో మహేశ్​బాబు రికార్డ్​

ట్విట్టర్​లో మహేశ్​బాబు రికార్డుల మోత

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్ బాబు ట్విట్టర్​లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. #HBDMaheshbabu అనే హాష్​ ట్యాగ్​ పేరుతో గత 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ఇంకా ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మహేశ్​బాబు ట్విట్టర్​లో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారని మహేశ్​బాబు అభిమాన సంఘాలు చెబుతున్నాయి.

Read More
కియారా వెంట పడ్డ టాలీవుడ్​

‘కియారా’ జపం చేస్తున్న టాలీవుడ్​

కియారా అద్వానీ టాలీవుడ్​లో రెండే సినిమాలు చేసినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్​ అగ్ర నిర్మాతలంతా కియారా జపం చేస్తున్నారట. సూపర్ స్టార్ మహేశ్​బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో చాలా క్యూట్‌గా కనిపించి ఆకర్షించిన ఈ అమ్మడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లోనూ అదే తరహా పాత్రలో చేసింది. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఈ […]

Read More