Breaking News

SIRICILLA

కట్కూర్​లో భయం, భయం

సారథిన్యూస్​, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్​ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్​కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్​కు […]

Read More

అనుమతులు లేని స్కూళ్లపై కేసులు

సారథిన్యూస్​, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్​ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్​ మారవేని రంజిత్​కుమార్​, నాయకులు ప్రశాంత్​, వినయ్​, ప్రణయ్​ తదితరులు ఉన్నారు.

Read More