Breaking News

RETAIL

చెప్పిన పంటలు వేయమనడం సరికాదు

సారథి న్యూస్, రామడుగు: రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ కల్పించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధును ఏ విధమైన షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను వేయాలనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో నాయకులు జెట్టవేని అంజి బాబు, బోయిని వెంకటేశం, మ్యాడారం సత్యనారాయణ, గాలిపల్లి రాజు పాల్గొన్నారు.

Read More