Breaking News

RAJBHAVAN

తమిళనాడు రాజ్​భవన్​లో 84 మందికి కరోనా

రాజ్​భవన్​లో 84 మంది కరోనా

చెన్నై: తమిళనాడు గవర్నర్​ అధికారిక నివాసం రాజ్​భవన్​లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్​భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్​ బన్వర్​లాల్​ పురోహిత్​ను కాంటాక్ట్​ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Read More

ఐసోలేషన్​లోకి మహారాష్ట్ర గవర్నర్​

ముంబై: మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కొశ్యారీ సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. రాజ్​భవన్​లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్​ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

Read More