Breaking News

peddashnakrampet

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More