Breaking News

PASSAWAY

కటుకం రవీందర్​కు నివాళి

సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​ కటుకం రవీందర్​కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్​ఎస్​ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్​రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]

Read More
శేఖర్​ కమ్ముల

శేఖర్​ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్​ బన్సీలాల్​ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్​ కమ్ములకు ఫోన్​ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్​స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తయినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

Read More