సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.
సారథిన్యూస్, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం ధర్మారం చౌరస్తాలో వందమంది ఆటో డ్రైవర్లకు రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ అద్దంకి శరత్, మడిపెల్లి మల్లేష్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందన పల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, ఇంజం సాంబశివరావు, గాజుల రమేష్, తిరుమలచారి, వెంకటేశ్, పాషా, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.