Breaking News

OPENCOAST

గేడర్ తగిలి సింగరేణి కార్మికుడి మృతి

గ్రేడర్ తగిలి కార్మికుడి మృతి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు రాథోడ్ (25) ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల కథనం.. శనివారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్ లో బ్లాస్టింగ్ అనంతరం వాహనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్రేడర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రాంతం కాని ప్రాంతం […]

Read More
ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

ఏటూర్ నాగారం టైగర్ జోన్ వద్దు

సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్​జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]

Read More

గనిలో పేలుడు.. నలుగురి దుర్మరణం

సారథి న్యూస్​, గోదావరిఖని: జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు కార్మికులు బండి ప్రవీణ్ (గోదావరిఖని), రాజేష్( ఖమాన్పూర్), అంజయ్య, రాకేష్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు వెంకటేష్, భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More