Breaking News

MUMBAI

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ముంబై: బిగ్​ అమితాబచ్చన్​ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్​తోపాటు ఆయన కుమారుడు అభిషేక్​, కోడల్​ ఐశ్వర్యరాయ్​, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్​, అభిషేక్​ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్​, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

Read More

రిలయన్స్​కు నష్టం

ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్‌ యాన్యువల్‌ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్‌ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్‌ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్‌ బఫెట్‌, లారీ పేజ్‌, ఎల్‌ముస్క్‌, సర్జీ బ్రిన్‌ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్‌ – సౌదీ అరామ్‌కో […]

Read More
వరవరరావుకు కరోనా పాజిటివ్​

వరవరరావుకు కరోనా పాజిటివ్​

సారథిన్యూస్​, హైదరాబాద్: ​ విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్​ జార్జ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్​ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్​ఐఏకు (నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]

Read More

రాజగృహపై దాడి అమానుషం

సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్​ సదన్​ మహారాజ్​ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను […]

Read More

ఐశ్వర్య, ఆరాధ్యకు ఇంట్లోనే చికిత్స

ముంబై: బాలీవుడ్​ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబచ్చన్​, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్​ బచ్చన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్​కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్​ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్​ నటుల్లో ప్రస్తుతం […]

Read More

ఐసోలేషన్​లోకి మహారాష్ట్ర గవర్నర్​

ముంబై: మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కొశ్యారీ సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. రాజ్​భవన్​లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్​ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

Read More

దళితుల ఆత్మగౌరవంపై దాడి

సారథిన్యూస్, రామడుగు: అంబేద్కర్​ ఇంటిపై దాడిచేయడమంటే దళితుల ఆత్మగౌరవంపై దాడిచేసినట్టేనని టీపీసీసీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ వెన్న రాజమల్లయ్య పేర్కొన్నారు. అంబేద్కర్​ నివాసం రాజగృహపై దాడిని కాంగ్రెస్​ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ డిమాండ్​ చేశారు. […]

Read More

‘కరోనా’పై వర్మ క్లారిటీ

తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్​వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్​ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్​ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్​, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్‌ అంటూ హారర్‌ […]

Read More