సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]
సారథి న్యూస్, వెంకటాపూర్: కనుపాపల తలచి, ఆత్మీయతను పంచి, కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పోలీసు స్టేషన్ లో మహిళా పోలీస్కానిస్టేబుళ్లు, జవహర్ నగర్ పెట్రోల్ బంకులో […]
సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన […]
సారథి న్యూస్, ములుగు: మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులను ఆదరించాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం మల్లంపల్లిలో ఓ అనాథ వృద్ధుడికి తస్లీమా స్వయంగా అన్నం తినిపించిన విషయం విదితమే. శనివారం ఆమె ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, జుట్టుతో చలనం లేకుండా పడుకుని ఉండడం చూసి ఆమె చలించిపోయారు. క్షవరం చేయించి తానే స్వయంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు కొనిచ్చి […]
సారథి న్యూస్, వాజేడు: మండలంలోని కొంగల గ్రామంలో జగన్నాథపురం సబ్ సెంటర్ లో ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించారు డాక్టర్ యమున. ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, తేమడతో రక్తంపడడం, ఆకలి మందగించడం వంటి వారిని గుర్తించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రంమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర రావు, సర్పంచ్ శివరామకృష్ణ, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఎస్.రవి, ఎల్ టి.రజినీకాంత్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన గరగ నారాయణమ్మ సంవత్సరికం సందర్భంగా గరగ సురేష్, కుమార్ రాజు, సతీమణి ఇందు, కుమార్తె ముకుందప్రియ, బంధువులు కుమారి, బాలు తదితరులు స్థానిక గ్రేస్ హోమ్ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు. అక్కడి వృద్ధులకు వారి కుమార్తె ముకుందప్రియ అన్నదానం చేశారు. గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్రప్రసాద్, పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ, […]
ఓ అనాథ వృద్ధుడికి అన్నం తినిపించి.. మానవత్వం చాటిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ సారథి న్యూస్, ములుగు: పేదల ఆకలి తీరుస్తున్నారు.. అభాగ్యులకు నేనున్నామని అభయమిస్తున్నారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆకలితో అలమటిస్తున్న ఓ అనాథ వృద్ధుడికి తన స్వహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా ఉద్యోగరీత్యా బుధవారం ఉదయం హన్మకొండ నుంచి ములుగు వస్తున్న క్రమంలో మల్లంపల్లి సమీపంలో ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధుడు […]
సారథి న్యూస్, వాజేడు: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దగొల్లగూడెంలో 225 దోమతెరలను పంపిణీ చేశారు. వీటిని తప్పనిసరి వాడాలని డాక్టర్ యమున సూచించారు. దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, లలిత కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ శేఖర్, చిన్న వెంకటేశ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.