Breaking News

KULBHUSHAN

కులభూషణ్​ను కలిసేందుకు అనుమతి

కుల్‌భూషణ్​ను కలిసేందుకు అనుమతి

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో పాకిస్థాన్​లో అదుపులో ఉన్న కుల్​భూషన్‌ జాదవ్‌ను కలిసిందేకు పాకిస్తాన్‌ భారత్‌కు పర్మిషన్‌ ఇచ్చింది. జాదవ్‌ను అధికారులు మూడోసారి కలవనున్నారు. ఇంటర్నేషనల్‌ కోర్టు ఇచ్చిన వెసులుబాట్లను పాక్‌ కల్పించడం లేదని, కోర్టు తీర్పును పక్కనపెట్టిందని ఇండియా ఆరోపించిన నేపథ్యంలో అతన్ని కలిసేందుకు పాక్‌ అధికారులు పర్మిషన్‌ ఇచ్చారు. పాకిస్తాన్‌ అధికారులు లేకుండా కుల్‌భూషన్‌ యాదవ్‌ను కలిసేందుకు వీలు కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ చెప్పారు.

Read More