Breaking News

JOGULAMBA

తుంగ తీరం.. భక్తజన సంద్రం

– తుఫాన్​ జల్లుల్లో పుష్కరస్నానం సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి సన్నిధిలో తుంగభద్ర తీరం భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. శుక్రవారం పుష్కరఘాట్ కు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర కార్తీకమాసం కావడంతో భక్తులు తుంగభద్ర నదీమ తల్లిని కార్తీక దీపాలతో ఆరాధిస్తున్నారు. కార్తీకదీపాలు వెలిగిస్తూ అమ్మవారిని, అదేవిధంగా బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేకపూజలు చేశారు. ఓ వైపు తుఫాన్ ప్రభావంతో మేఘాలు కమ్మేసి వాన జల్లులు కురుస్తున్నా యాత్రికులు మాత్రం పుష్కర […]

Read More
పులకించిన పుల్లూరు

పులకించిన పుల్లూరు

లక్ష తులసి దళాలతో అర్చన జ్యోతివాస్తు విద్యాపీఠం పుష్కర పూజలు సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర నది పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పుల్లూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పీఠాధిపతి జ్యోతి వాస్తు విద్యాపీఠం సిద్ధాంత భాస్కర మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో బాసర సరస్వతి అమ్మవారికి లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుష్కర ఘాట్ లో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి […]

Read More

పుష్కరుడి చెంతకు భక్తజనం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి సన్నిధిలోని పుష్కర ఘాట్ కు భక్త జనసందోహం రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రోజు ఐదో రోజుకు పుష్కరాలు చేరాయి. తెల్లవారుజామున 5గంటల నుంచే భక్తులు తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు ఆచరించి జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వరుణుడిని దర్శించుకున్నారు. సుమారు 15వేల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. మాననపాడు మండలం పుల్లూరు గ్రామశివారులోని తుంగభద్ర నది తీరాన ఏర్పాటుచేసిన […]

Read More
పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​(మానవపాడు): తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం నుంచి జోగుళాంబ ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసును అలంపూర్ మున్సిపాలిటీ వారు, జోగుళాంబ ఆలయం ట్రస్ట్ బోర్డు వారు కలిసి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటుచేశారు. సెట్వీన్ బస్సు సర్వీసులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, టెంపుల్ బోర్డ్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ […]

Read More
అమ్మవారికి పుష్కర స్నానం

అమ్మవారికి పుష్కర స్నానం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్​ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]

Read More
తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

తుంగభద్ర తీరం.. పుష్కరశోభితం

సారథి న్యూస్​, తుంగభద్ర పుష్కరాలు: తుంగభద్ర నది పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. రాజోలిలోని పుల్లూరు, అయిజ మండలం వేణిసోంపురం ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ స్నానాలు చేసిన అనంతరం అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. :: ఫొటోలు, సాధిక్, మానవపాడు

Read More
ఇంటింటా దీపావళి

ఇంటింటా దీపావళి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో దీపావళి పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More
పుష్కరాలను సక్సెస్​చేయండి

పుష్కరాలను సక్సెస్​ చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్​ చేయాలని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్​లో కలెక్టర్ ​శృతిఓజా, ఎస్పీ రంజన్​రతన్​ కుమార్​తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్​డబ్ల్యూఎస్​శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్​ పౌడర్​ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]

Read More