సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): గిరిజన యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై గవర్నర్ స్పందించాలని ఎరుకల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సురాబాద్ డివిజన్, నాంచారమ్మ బస్తీలో ఎరుకల అభివృద్ధి సేవా సంఘం అధ్యర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన యువతిపై 139 మంది అత్యాచారం చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళపై లైంగికదాడి చేసిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: నిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సందర్శించారు. కరోనా మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిని ఆమె పరామర్శించారు. నిమ్స్లో ఇప్పటివరకు నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్ డాక్టర్లు, 8మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారినపడ్డారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సంక్షేమ పథకాలు, సరికొత్త ఆవిష్కరణలతో దేశానికే దిక్సూచిలా మారిన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ, శాంతియుత పోరాటం ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఆరేళ్ల కాలంలో రాష్ట్రం […]