సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు […]
సారథి న్యూస్, రామాయంపేట: రైతువేదిక పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్నగేష్ కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఏవో పరశురాంనాయక్, ఏవో సతీశ్ ఉన్నారు.