ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి […]
సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.
– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే […]
– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా […]
* రాజన్న సన్నిదిలో కొడేమొక్కులు రద్దు సారథి, వేములవాడ: శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందింది. రాజన్న ఆలయంలో కారోన వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోంది. దీంతో గురువారం నుండి రాజన్న ఆలయంలో కోడె మొక్కుబడితో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి పాలకవర్గం, అధికారులతో ఏర్పాటు చేసి అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడుతూ […]
– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]
కొవిడ్ కాటుకు కానిస్టేబుల్ భీమయ్య మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్, అడిషినల్ ఎస్సీ సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కరోనాతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన బైరినేని భీమయ్య(47) సిద్దిపేట జిల్లా కొహెడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. భీమయ్యకు నాలుగు రోజుల క్రితం […]
పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్లోని దనాపూర్కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ […]