చంఢీఘర్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్ఆఫర్ ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఆ రాష్ట్రంలోని 1 నుంచి 12 వ తరగతి వరకు 25 శాతం వరకు సిలబస్ను తగ్గించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎంఎస్సీఈఆర్టీ) ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలో సిలబస్ కోతను విధించనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే 9 నుంచి 12 […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]
ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.