సారథిన్యూస్, రామగుండం: బషీర్బాగ్లో అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించిన మారణకాండ తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వామపక్షాల నేతలు బషీర్బాగ్ అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తెలుగుజాతి ఎప్పటికి క్షమించబోదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాచేసిన అమాయకరైతులను, వామపక్ష ఉద్యమకారులను చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా పొట్టనపెట్టుకున్నదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు గౌతం గోవర్ధన్, […]